జన జాగృతి యాత్ర 59వ రోజు

రాజానగరం, జనసేన జనజాగృతి యత్ర 59వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలో బుధవారం కార్యక్రమంలో భాగంగా 300 గాజు గ్లాసులు పంపిణీ చెయ్యటం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 51,000 వేల గాజు గ్లాసులు పలు గ్రామాల్లో ఇవ్వటం జరిగింది. జనసేన జన జాగృతి యత్ర కార్యక్రమం శ్రీకారం చుట్టిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు మండపాక శ్రీను అధ్యక్షతన దిగ్విజయంగా ముందుకు సాగుతూ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జండా ఎగరేసే విధంగా ముందుకు సాగింది. గ్రామ గ్రామన ప్రతి ఇంటింకి వెళ్లి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రంలు ప్రజలకు అందిస్తూ జనసేన పార్టీని, కొణిదెల పవన్ కళ్యాణ్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు రాచపోతుల సురేష్, పేమ్మడా సతీష్, కొచ్చర్ల భరత్, కొచ్చర్ల బాబి, మండపాక మురళి మరియు గ్రామ జనసేన నాయకులు జనసేన పార్టీ తరుపున ఎంపిటిసీగా పోటీ చేసిన పొట్నూరి అచ్చియమ్మ, డి.ఎం రాజు, డి. పోతిబాబు, పొట్నూరి అప్పన్న, శ్రీహరి హరిచంద్ర, డి మహా, బి కృప, ఎన్ విజయ్, పి ఆకాష్, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.