“పవనన్న చేనేత బాట” 75వ రోజు

చీరాల, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనలతో, మరి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ సలహాలతో “పవనన్న చేనేత బాట” 75వ రోజు కార్యక్రమం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ ఆధ్వర్యంలో పందిళ్ళపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉషా, వీర మహిళ సుంకర కళ్యాణి లతో పాటు పవనన్న చేనేత బాట కార్యక్రమ యువకులు కర్ణ కిరణ్ తేజ్, పింజల సంతోష్, వరం బూడిద, మనోజ్ కుమార్, గుత్తి సదాశివ రావు, తోట చక్రి, యశ్వంత్, మోహన్ కృష్ణ, పవన్ కళ్యాణ్, కళ్యాణ్ రాపర్తి దుర్గ, సాంబయ్య, డోగుపర్తి లలిత్ కుమార్ లు పాల్గొన్నారు.