పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 9వ రోజు

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా అనే కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమై ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించడం జరుగుతుంది. మొదటి విడత కార్యక్రమంలో భాగంగా గురువారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం, తెలకపల్లి మండలం, పెద్దపల్లి గ్రామంలో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 9వ రోజు నిర్వహించడం జరిగింది. తెల్కపల్లి టౌన్ లో వంగ లక్ష్మణ్ గౌడ్ గడప గడపకు పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు, ఎండి మహబూబ్ మరియు నాగర్ కర్నూల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు గోపాస్ కుర్మన్న, దేశమొని రాజేష్, గోపాస్ రమేష్, కొడిగంటి సాయి కుమార్, సూర్య, వంశీ, శివాజీ, ప్రశాంత్, శివ, శేఖర్, మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.