జనసేన ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి

  • ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు అంబేద్కర్.. ఆదాడ మోహనరావు

విజయనగరం: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 66వ వర్ధంతి కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగవారం ఉదయం నిర్వహించారు. ముందుగా పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు, వంక నరసింగరావు, రౌతు సతీష్, యర్నాగుల చక్రవర్తి, త్యాడ రామకృష్ణారావు(బాలు) అంబేద్కర్ జంక్షన్ వద్ద నున్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన ఘనత మహనీయులు అంబేద్కర్ అని, ప్రస్తుత పాలకులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కులం పునాదుల మీద ఏమి సాంధించలేరని రాజ్యాంగంలో నాడు కల్పించిన ఓటు హక్కు, పౌర హక్కులు ఏనాటికీ ప్రజలకు రక్షణగా ఉంటాయని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంబేద్కర్‌ భావజాలంతోను, స్ఫూర్తితోనే పార్టీ పెట్టారని, ప్రతీ జనసైనికులు, నాయకులు పవన్ కళ్యాణ్ భావజాలాన్ని అర్థంచేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.