శోభానాయుడు లేని లోటు తెలుగు సాంస్కృతిక సమాజానికి తీరని లోటు

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు కన్నుమూశారు.  కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శోభానాయుడు ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

`శోభానాయుడు లాంటి గొప్ప కూచిపూడి కళాకారిణి ఇక లేరని తెలిసి ఎంతో బాధకు గురయ్యాను. ఆమె మృతి మనకీ, తెలుగు సాంస్కృతిక సమాజానికి తీరని లోటు. తన గురువు శ్రీ వెంపటి చిన సత్యంగారి వారసత్వాన్ని శోభానాయుడు ఘనంగా కొనసాగించారు. కూచిపూడి ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని అందరికీ పరిచయం చేశారు. ఎంతో మంది కూచిపూడి నృత్య కళాకారులను తయారు చేశారు. వారితో నాకు వ్యక్తి గతంగా ఎంతో పరిచయం ఉంద`ని చిరంజీవి పేర్కొన్నారు.