విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో దెందులూరు జనసేన నాయకులు పల్నాటి సాగర్

దెందులూరు నియోజకవర్గం, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన పార్టీ ఈ నెల 18,19 మరియు 20వ తేదీలలో చేపడుతున్న డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా రాష్ట్ర ఎంపీలను ట్యాగ్ చేసి వారిపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా శ్రీ పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ పల్నాటి సాగర్ ఈ డిజిటల్ క్యాంపెయిన్లో పాల్గొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎంపీ లందరూ పార్లమెంట్ లో గళం విప్పి స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని కోరారు.

స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే ఈ రోజు దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండడం చాలా బాధాకరం అని ఇప్పుడైనా కళ్ళు తెరచి స్టీల్ ప్లాంట్ కోసం అందరూ కలిసి కేంద్రంపై వత్తిడి తేవాలని ఆయన కోరారు.