విజయవంతంగా శ్రమదాన కార్యక్రమం చేపట్టిన దెందులూరు జనసేన నాయకులు
ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాజమహేంద్రవరంలొ శ్రమదాన కార్యక్రమనికి వెళ్లనీయకుండా దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కోటగిరి సుధాకర్ మరియు పల్నాటి సాగర్ లను గృహనిర్భంధం చేయడం జరిగింది. గృహనిర్భంధం సైతం లెక్క చేయకుండా దెందులూరు నియోజకవర్గం, పెదపాడు మండలం లో రోడ్ల మరమత్తులు చేయడం జరిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పెద్ద పెద్ద రోడ్లను తమ సొంత ఖర్చులతో బాగు చేస్తూ తమ నిరసనను ప్రభుత్వానికి తెలియ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోటగిరి వెంకట సుధాకర్, పల్నాటి సాగర్, పెదపాడు విలేజ్ కోఆర్డినేటర్ దుర్గ వేమిరెడ్డి, వార్డ్ మెంబర్ ముద్దాన వెంకట రావు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-02-at-3.34.04-PM-1024x1024.jpeg)