టీం పిడికిలి గోడప్రతులను ఆవిష్కరించిన దేవరపల్లి జనసేన

గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో శనివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తరువాత ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారో వారి కుటుంబాలకు అండగా 30 కోట్ల రూపాయల వ్యయంతో కుటుంబానికి లక్ష రూపాయలు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో వాల్ పోస్టర్లు ను ఎన్నారై టీం పిడికిలి ఆధ్వర్యంలో ప్రచురించడం జరిగింది. ఆ వాల్ పోస్టర్స్ ను శనివారం నియోజకవర్గంలో ఆవిష్కరించం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కాట్నం గణేష్, కాళ్ల వెంకట్ రత్నం ,చప్పటి శివప్రసాద్ ,అనుమ రెడ్డి ఆంజనేయులు, కంబాల సత్తిబాబు, సూరిశెట్టి బాలాజీ, జాజి మొగ్గల శ్రీనివాస్, కొడమంచిలి శ్రీను, షేక్ కాజు, సిద్ధా తాతబ్బాయి, పోలినాటి నాని, బాలం మణికంఠ, మాలే సతీష్, ఆరేటి రత్నం, కనగర్ల రేవంత్ గారు, అనిశెట్టి మధు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.