టిడిపితోనే అభివృద్ధి సాధ్యం

  • సోమిరెడ్డి గెలుపుతో నియోజకవర్గం అభివృద్ధి.. సోమిరెడ్డి శృతి రెడ్డి

మనుబోలు మండలంలోని యాచవరం గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో తీసుకువెళ్లి ప్రజలకు సంక్షేమం అందిస్తారని సోమిరెడ్డి శృతి రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం మనుబోలు మండలంలోని యాచవరం గ్రాంమంలో ఆమె స్థానిక టిడిపి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్దిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారని, ఆయనను గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. తాను ఏక్కడికి వెళ్లి ప్రచారం చేసిన టిడిపికి మంచి స్పందన వస్తుందని, సోమిరెడ్డి గెలుపు ఖాయమన్నారు. మనుబోలు పంచాయతీలో మురికి కాలువలు అద్వాన్నంగా ఉన్నాయని, సరిగా నిర్మాణాలు చేపట్టకపోవడంతో నీరు వెళ్లక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వీధి లైట్లు వెలగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఆమె వెంట టిడిపి నాయకులు తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్రరైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, దండు చంద్ర శేఖర్ రెడ్డి, సాని వెంకట రమణయ్య, చేరెడ్డి కోదండరామి రెడ్డి, కలికి రమేష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, బీసీ మండల అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్, గుంజి సతీష్, గుంజి వెంకటేశ్వర్లు, శివుడు రాజా గౌడ్, బిజెపి మండలాధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి, జనసేన నాయకులు ప్రసాద్, జాకీర్, కోటిరెడ్డి, ఖాదర్ వల్లీ, శ్రీను, సురేష్, శ్రీకాంత్ మరియు టీడిపి కార్యకర్తలు చింతల వెంకటేశ్వర్లు, పుట్ట మస్తాన్, తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటా శృతి రెడ్డి రాకను ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా తెలుగుదేశం అభిమానులు వారి అభిమానాన్ని విడిది మరియు శాలువా, పూలమాలలతో సత్కరించారు. శ్రుతి రెడ్డి కూడా ఈ ఆనందాన్ని పంచుకుంటూ.. ప్రతి రోజూ వచ్చి పొత్తులో భాగంగా అండగా వున్న మనుబోలు జనసైనికులను కూడా అభినందించారు.