కౌలు రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది: నాయిని సతీష్

కంచికచర్ల జనసేన పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాయిని సతీష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు అండగా ఉంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా మోసం చేసిందని విమర్శించారు. అకాల వర్షం కు పంటలు దెబ్బతిని చేసిన అప్పు తీర్చలేక వడ్డీలు కట్టలేక తీవ్ర మనస్థాపం తో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఈ ప్రభుత్వానికి కనిపించక పోవటం బాధాకరమని అన్నారు. తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి నియోజవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కార్యదర్శి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి తాటి విజయమ్మ, సంయుక్త కార్యదర్శి కమ్మం పాటి రమాదేవి, నాగలక్ష్మి, పెద్దినేడి హరి, కుర్ర నాని, పుప్పాల వేణు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.