పామిడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ధనుంజయ్

గుంతకల్: పామిడి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డిని మంగళవారం పామిడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు యం.ధనుంజయ్ జనసేన తరఫున మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో సత్కరించి రాబోవు రోజుల్లో పామిడి మండలంలో జనసేన చేపట్టబోయే కార్యక్రమాలకి తమ వంతు సహకారాలను అందించాలని, మండలంలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరడమైనది. ఈ సందర్భంగా సిఐ ప్రజా పక్షాన పోరాడే పార్టీలకు కచ్చితంగా వారి హక్కులు కాపాడే విధంగా పోలీసు శాఖ సహకరిస్తుందని తెలియజేశారు.