నష్టపరిహారం చెల్లించాలని ధర్నా

పాయకరావుపేట, కోటవురట్ల పశువుల హాస్పిటల్ దగ్గర శనివారం జనసేన పార్టీ నాయకులు ధర్నా చేయడం జరిగింది. 01-05-2021లో జనసేన నాయకులు జవ్వది బద్రి ఆవు చనిపోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఒక్కరూపాయి కూడా చెల్లించలేదు. తక్షణమే ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో కోటవురట్ల మండల జనసేనపార్టీ నాయకులు బద్రి, పవన్, బోడపాటి రవికుమార్ పాల్గొన్నారు.