కొరముట్ల కమీషన్ కు పని చేసాడా?: తాతంశెట్టి నాగేంద్ర

రైల్వేకోడూరు నియోజకవర్గం: రైల్వేకోడూరులో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కోడూరుఎమ్మెల్యే కోరముట్ల రాజమండ్రి జైలు సాక్షిగా పవన్ కళ్యాణ్ పార్టీని అమ్మేశాడు అన్నారు. మరీ దగ్గరుండి కమీషన్ కోసం కొరముట్ల శ్రీనివాసులు బ్రోకర్ పని చేసి అమ్మించాడ? అని నిలదీశారు. వైసీపీ సంక్షేమం ఊదర గొట్టే ఎమ్మెల్యే గారు 15 ఏళ్లు పదవిలో ఉండి రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధి మీద శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ఉందా! లేదా బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. ములాఖాత్ కు వెళ్లి డీల్ కుదుర్చుకున్నారు అన్న ఎమ్మెల్యే గారు.. ఆరునెలలు ఆగితే మీ నాయకుడు పర్మినెంట్ గా జైల్లో ఉంటారని ఇప్పటి నుంచే అడ్వాన్స్ గా ములాఖాత్ కు ట్రై చేయాలని ఎద్దేవా చేశారు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని చేసిన రైల్వేకోడూరు అభివృద్ధికి పైసా పని చేయని కొరముట్లకు “అభివృద్ధి నిరోధక రత్న” బిరుదు ఇవ్వాలని, హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన సీఎం గారు ఏమ్ డీల్ కోసం వెళ్ళాడో కొరముట్ల తెలపాలన్నారు. 2024లో మీ అవినీతి, అక్రమ, అరాచక, దోపిడీ పాలనకు సమాధి కట్టడానికి ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు అని మీ రాజకీయ ఆయస్సూ ఆరు నెలలే అని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జోగినేని మణి, పగడాల వెంకటేష్, గంధం శెట్టి దినకర్ బాబు, సర్పంచ్ సంయుక్త, ముద్దపొలు రామసుబ్బయ్య, వరికూటి నాగరాజ, మాదాసు నరసింహ, బీదఒ నవీన్ కుమార్, దాసరి వీరేంద్ర, పగడాల చంద్ర శేఖర్, కనుపర్తి శంకరయ్య, నగిరి పాటి మహేష్, పగడాల మణి ప్రసాద్, శ్రీకారం ప్రకాష్, పెంచలయ్య, మనోజ్, నీలం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.