రాజకీయ విమర్శలు చేయడానికే ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చారా: కందుల దుర్గేష్

జనసేన కార్యవర్గ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. జగన్ అసమర్థ పాలనపై ప్రశ్నల వర్షం కురిపించారు..

విద్యుత్ ఉద్యోగులకు 13 వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేదంటే మీ అసమర్ధ పాలన బైట పడింది.

క్రితం సంవత్సరం లక్షా 19వేల మంది మత్స్యకారులకు భృతి ఇచ్చారు మరి ఈ సంవత్సరం లక్ష మందికే ఎందుకు ఇచ్చారు..?

మల్లాడి సత్యలింగం నాయకర్ గురించి మీరు నిన్న ఎంతో గొప్పగా చెప్పారు మరి అదే మత్స్యకారులు కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పెట్టమని కోరితే ఎందుకు పెట్టలేదు..?
టర్న్ కీ సంస్థ కు మీకు ఉన్న లింక్ ఏమిటి..? టర్న్ కి జగన్ బినామీ సంస్థ.

జే పీ వెంచర్స్ కు ఇసుక తవ్వకాలు ఇచ్చినప్పుడు మధ్యలో టర్న్ కీ ఎలా వచ్చింది..? గతంలో చెల్లింపులు ఆన్ లైన్ లో జరిగేవి. ఇప్పుడు అలా ఎందుకు జరగడం లేదు..?

జగన్ ఈ రాష్ట్రానికి ఉత్తుత్తి పుత్రుడు మాత్రమేనని కందుల దుర్గేష్ ఎద్దేవా చేశారు.

ఈ సమావేశంలో కందుల దుర్గేష్ తో పాటూ.. పీఏసీ సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జిలు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.