జలమురు జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు మేరకు రోడ్డు గంతులుగా ఉండటంతో #GoodMorningCMSir కార్యక్రమంలో జలమురు మండలం, అందువరం పంచాయతీలో సుమారు 10 గ్రామాలు గుంతలతో ఉండడంతో జలమురు జనసేన నాయకులు రహదారికి వెళ్లి డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టారు. ఈ కార్యముంలో జలమురు జనసేన నాయకులు నడుపురి తిరుపతిరావు, నరసన్నపేట నియోజకవర్గం సీనియర్ నాయకులు, బోడెం జితేంద్ర, జనసైనీకులు జయప్రదం చేసారు.