దిల్రాజు బర్త్డే సెలబ్రేషన్స్
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ దిల్ రాజు నేడు 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి ఇండస్ట్రీ వర్గాలకు బర్త్డే పార్టీని గ్రాండ్గా ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అక్కినేని స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, నితిన్, రామ్ `కేజీఎఫ్` స్టార్ యశ్, హీరోయిన్లలో రాశిఖన్నా, సమంత, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ ఈ పార్టీకి హాజరై హంగామా చేశారు. కరోనా ఎఫెక్ట్ తో ఈవెంట్స్ లేక చాలా రోజులే అవుతుంది. దిల్ రాజు బర్త్ డే సెలబ్రేషన్స్ ఈవెంట్ తో తారలంతా ఒక్కచోట చేరారు. స్టార్ హీరోలు మహేశ్బాబు, ప్రభాస్, రాంచరణ్, విజయ్ దేవరకొండతోపాటు రామ్, నాగచైతన్య దిల్ రాజు కు బర్త్ డే విషెస్ చెప్పి ఆయనతో కలిసి కెమెరా ఫోజులిచ్చారు. తమ అభిమాన తారలు ఇలా ఒకే ఫ్రేములో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. చాలా కాలం తర్వాత ఇలా స్టార్ హీరోలు కలిసి దిగిన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రిండింగ్ అవుతోంది.
ఇదిలా వుంటే దిల్ రాజు శుక్రవారం తన బర్త్డే వేడుకల్ని ఫ్యామిలీతో కలిసి గోవాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందు కోసం శుక్రవారం ఉదయం ఫ్యామిలీతో సహా గోవా వెళ్లారాయన. భార్య వైఘారెడ్డితో కలిసి గోవాలో దిల్ రాజు పుట్టిన రోజుని ఎంజాయ్ చేస్తున్నారు.