తొలగించిన అర్హుల ఫించన్లు వెంటనే అమలు చేయాలి.. రాజారెడ్డి

  • ఎన్నికల ముందు జగనన్న ముద్దులు
  • ఎన్నికల తరువాత జగనన్న గుద్దులు
  • తొలగించిన ఫించన్ బాధితులకు అండగా జనసేన
  • తొలగించిన అర్హుల ఫించన్లు వెంటనే అమలు చేయాలి.. తిరుపతి జనసేన నిరసన

తిరుపతి: ఫించన్ పేరుతో కోట్ల రూపాయిలు ఖర్చు చేసి మరీ పిట్టల దొర కబుర్లు చెప్పిన బటన్ రెడ్డి, లక్షలాది మంది ఫించన్లు ఎలా తొలగిస్తారని తిరుపతి జనసేన పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి మండిపడ్డారు. తొలగించిన అర్హుల ఫించన్లు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జనసేన ఆధ్వర్యంలో తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం బుధవారం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ ఆ ఫించన్ మీద ఆధారపడి జీవించే నిరుపేదకు వేల ఎకరాల భూములు ఎలా వస్తాయి అని భూములు ఉన్నాయని ఆన్ లైన్ లో తప్పుగా చూపినంత మాత్రాన విచారణ లేకుండా ఫించను నిలిపేస్తారా..? అని వృద్ధాప్యంలో భరోసా లేకుండా చేస్తారాఅని మీరు నెత్తి మీద చేతులు పెట్టి నిమిరిన అవ్వా, అక్క, తాతలకు మీరు చేస్తోంది అన్యాయం కాదా, మీరు ఫించన్ ఇవ్వలంటే మూడేళ్ల క్రితం చనిపోయిన వారు కూడా బతికి వచ్చి మీకు టాక్సులు కడతారు, సొంత ఇల్లు ఉంటే ఫించన్లు కట్ చేస్తున్నారు, అద్దె ఇంట్లో ఉండడానికి మీరిచ్చే ఫించన్ డబ్బు సరిపోతుందా సొంత ఇల్లు ఉంటే ఆకలి తీరిపోతుందా, వృద్ధులకు వేసుకోను మందులు వచ్చేస్తాయా, వయసు మళ్లిన అవ్వా తాతలంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత పగఅని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో వారంతా మీకే ఓట్లు వేశారు కదా, అయినా కనికరం చూపరా కొత్త ఏడాది వీళ్ల ఫించన్ లో రూ. 250 కలుస్తుంది అన్న ఆశతో ఉన్న వారి ఆశల మీద నీళ్లు చల్లుతారా, అసలుకే లేకుండా ఎత్తేస్తారా, ఫించన్ ఎత్తేసేందుకు మీరు చూపే కారణాలు సహేతుకంగా లేవు వృద్ధుల ఉసురు కొట్టుకోవద్దు జగన్ రెడ్డి, బటన్ నొక్కి అద్భుత పాలన చేస్తున్నాననుకుంటున్న మీరు ఆ డబ్బు ఎవరి ఖాతాలకు చేరుతుందో తెలుసుకోకపోతే ఎలా అని, తప్పు జరిగింది సరి చేస్తాం అని చెప్పాల్సిన మీరు చేసిన తప్పుని సమర్ధించుకోవడం ఏంటని, మీకు మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 26 వేల మందికి ఫించన్ రద్దు చేసినట్టు నోటీసులు ఇచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 60 వేల మంది ఫించన్ కట్ చేసేందుకు సిద్ధమయ్యారు, వారికి నోటీసులు కూడా ఇచ్చారు, ఇప్పటికే అర్హత ఉన్న లక్షలాది మంది ఫించన్లు తీసేశారు. గడప, గడపన మీ ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర లబ్దిదారులు మొరపెట్టుకున్నా కనికరం చూపడం లేదు ఎందుకని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్పందనలో ఫిర్యాదు చేసినా పరిష్కారానికి నోచుకోవడం లేదు, జగన్ మోహన్ రెడ్డి స్పందించే మనసు లేదని ప్రజలందరికీ అర్ధం అయిపోయింది, వృద్ధుల ఉసురు కొట్టుకున్న మీకు తగిన శాస్తి చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫించన్ ఇచ్చేంత వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని, వైసీపీ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కంటి మీద కునుకు లేకుండా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుభాషిని, కీర్తన, వనజమ్మ, లక్ష్మి, సత్యవంతుడు, రాజమోహన్, మునుస్వామి, రాజేష్ ఆచారి, హిమవంత్, సుమన్, మనోజ్, హేమంత్, సాయి దేవ్, కిషోర్, గోపి స్వామి, ఆది కేశవులు, భాను ప్రకాష్, పురుషోత్తం, సాయి, ముని, విశ్వ, పవన్ తదితరులు పాల్గొన్నారు.