సీతంపేట మండలంలో యువశక్తి పోస్టర్ల ప్రదర్శన
పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండలంలో, జనవరి 12న రణస్థలంలో జరగబోయే యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో యువశక్తి పోస్టర్ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ.. యువశక్తి కార్యక్రమం దేశంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక వినూతమైనత రీతిలో నిర్వహించబోతున్నామని, ఈ సభలో యువత ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సమస్యల మీద అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వాళ్ల గొంతు వినిపించేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో యువతకు దిశా నిర్దేశం చేయడం జరుగుతుంది., యువశక్తి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటున్నారని గర్భాన సత్తిబాబు అన్నారు. యువశక్తి కార్యక్రమంలో అత్యధికంగా యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీతంపేట మండలంలో 1000 పోస్టర్లను ప్రదర్శించామని ఆయన తెలియజశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-09-at-7.05.46-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-09-at-7.05.47-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-09-at-7.05.48-PM-1024x768.jpeg)