నేరెళ్ళ సురేష్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా రోగులకు పండ్లు పంపిణీ

గుంటూరు, జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ళ సురేష్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా గుంటూరు నగర కమిటీ కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు అయిన గుండాల శ్రీనివాసరావు, బొడ్డుపల్లి రాధాకృష్ణ, కొర్రాశ్రీను నాయక్ ల ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం అమరావతి రోడ్ లోని ఫీవర్(ఐడియా) హాస్పిటల్ నందు రోగులకు పండ్లు పంపిణీ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదాసు వెంకట సుబ్బారావు, సూదా నాగరాజు, సోమి ఉదయ్, పుల్లంశెట్టి ఉదయ్, పావులూరి కోటేశ్వరరావు, బండారు రవీంద్ర, కారుమంచి చంద్రబాబు నాయుడు, తోట కార్తిక్, తిరుమలశెట్టి కిట్టు, అబ్బు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.