పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ ఆధ్వర్యంలో అనాధాశ్రమంలో పంపిణీ

జనగామ జిల్లా, పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ ఆధ్వర్యంలో మానవ దృక్పథంతో బానాజీ పేట గ్రామానికి చెందిన గవ్వల శ్రీనివాస్ సిరివెన్నెల కుమారుడు శాన్విక్ పుట్టినరోజు సందర్భంగా జనగామ జిల్లా వర్ధన్ అనాధాశ్రమంలో 20 కిలోల బియ్యం పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తాను మాట్లాడుతూ ఇలా చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని జోగు భాస్కర్, రంజిత్ సింగ్, ఇటుకల శంకర్, నాని, జోగు ఉదయ్ మను గుజ్జుల నలిన్, గవ్వల జంపయ్య గవ్వల బీరయ్య రోహిత్, మను తదితరులు పాల్గొన్నారు.