జనసేన వనరక్షణలో 1000 కొబ్బరి మొక్కల పంపిణీ

  • జనం కోసం జనసేన 576వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 576వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం శుక్రవారం కిర్లంపూడి మండలం ముక్కొల్లు మరియు గండేపల్లి మండలం యల్లమిల్లీ గ్రామంలో నిర్వహిణడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1000 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 6800 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 577వ రోజు కార్యక్రమం శనివారం కిర్లంపూడి మండలం, రాజుపాలెం మరియు గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. శుక్రవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి బొట్లా రాజుబాబు, ముక్కొల్లు నుండి జోళ్ళ విఘ్నేశ్వరరావు, జలసూత్రపు మణికంఠ, యల్లమిల్లి నుండి సత్తి శ్రీను, సత్తి మహేష్, ఆరిమళ్ళ శివరామకృష్ణ, యడవిల్లి నాగవెంకటేష్, రొంగల నాయుడు, గురజాడ నాని, వల్లేపల్లి వీరేంద్ర, ఉంగరాల శ్రీను, గండేపల్లి నుండి ఆళ్ళ మణికంఠ, నాయకంపల్లి నుండి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు, బోడా అశోక్, బూరుగుపూడి నుండి పాటంశెట్టి నరేష్, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, గాలిదేవర దుర్గాప్రసాద్, జానకి మంగరాజు లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ముక్కొల్లు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన జువ్వల శ్రీను కుటుంబ సభ్యులకు, బంటు మణికంఠ కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలుతెలిపారు.