పాలకొండ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 1200 మాస్కులు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, పాలకొండ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతున్న సమయంలో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ సుమారు 1200 మాస్కులు పంచడం జరిగింది. ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా వేగవంతంగా పరీక్షలు నిర్వహించేలా కోవిడ్ పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ జనసేన పార్టీ కార్యకర్తలు గొర్లే మన్మధరావు, పోరెడ్డి ప్రశాంత్, కడగల హరికృష్ణ, పొట్నూరు రమేష్, వన్నలి చిన్నారావు, మిడితన ప్రసాద్, సాయి, ఉమా లోకేష్, రాంబాబు, పవన్ ప్రసాద్ తదితరులు పాల్గొనటం జరిగినది.