జనసేన వనరక్షణలో 700 కొబ్బరి మొక్కల పంపిణీ

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 584వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం శనివారం గండేపల్లి మండలం, గండేపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 కొబ్బరి మొక్కలు జనసైనికుల ఆధ్వర్యంలో పంచడం జరిగింది. నేటి వరకూ నియోజకవర్గం మొత్తంగా 12800 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, గండేపల్లి నుండి గరికపాటి ఉమేష్, బుర్ర వీరేంద్ర, మల్లేపల్లి నుండి అబ్బిరెడ్డి ప్రసాద్, వెంగయ్యమ్మపురం మరిశే శ్రీను, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, జల్లిగంపల శ్రీను లకు జనసేన తరఫున కృతజ్ఞతలు తెలిపారు.