పీర్ సాహెబ్ పేట గ్రామంలో క్రియాశీలక సభ్యత్వాల పంపిణీ

నందికొట్కూరు నియోజకవర్గం: నందికొట్కూరులోని పీర్ సాహెబ్ పేట గ్రామంలో క్రియాశీలక సభ్యత్వాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. నందికొట్కూరు నియోజకవర్గంలోని పీర్ సాహెబ్ పేట గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల పంపిణీ ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యంగా గ్రామంలోని ప్రజలు జనసేన పట్ల అంతులేని అభిమానం చూపిస్తూ పవన్ రావాలి పాలన మారాలి అనే నినాదంతో సంతోషం వ్యక్త పరిచారు. ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక ట్రాక్టర్ డ్రైవర్లుగా, లారీ డ్రైవర్లుగా, క్లీనర్లుగా వెలుతూ చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామంలో ఎక్కువ జనాభా చదువుకున్న యువకులే కావడంతో ఉద్యోగాలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలియపరిచారు. జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక భావితరాల భవిష్యత్తు బాగుపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. జనసేన ప్రభుత్వం వచ్చాక యువతకు ఉద్యోగాలు కల్పించి భావితరాలకు భరోసా ఇస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్లమల రవికుమార్ హాజరు కావడం జరిగింది.