ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పొన్నూరు నియోజవర్గం: చేబ్రోలు మండలం, మంచాల గ్రామ అధ్యక్షులు అన్నదాసు రామకృష్ణ అధ్యక్షతన ఆదివారం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు కిట్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల మీద ఇష్టంతో అన్ని పార్టీలు మాదిరిగా కాకుండా పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా అవ్వాలని ఉద్దేశంతో వినూత్నంగా ఆలోచించి కార్యకర్తలు శ్రేయస్సు కోసం 5 లక్షల రూపాయలు బీమాతో సభ్యత నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు అందరూ కలిసి చేబ్రోలు మండలంలో అలాగే మంచాల గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని తెలియజేశారు. అనంతరం సభ్యత నమోదు చేసుకున్న సభ్యులందరికీ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయ బాబు, జిల్లా నాయకులు నారదాసు ప్రసాద్, మేకల రామయ్య యాదవ్, చట్టాల త్రినాథ్, శిఖా బాలు, మండల అధ్యక్షులు చందు శ్రీరాములు, గ్రామఉపాధ్యక్షులు కోటా రాంబాబు, మండల నాయకులు రాంబాబు, మోహన్ రావు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.