అశ్వారావుపేట నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తెలంగాణ, అశ్వారావుపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తల భద్రత, భరోసా కోసం కల్పించిన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపణీ సోమవారం అశ్వారావుపేటలోని సత్యసాయి ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ ఇంచార్జ్ డేగల రామచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నియోజకవర్గం ఇంచార్జ్ మిర్యాల రామకృష్ణ, సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి నరేష్, పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ యార్లగడ్డ శ్రీనివాస్, ఖమ్మం నగర అధ్యక్షులు మెడబోయిన కార్తీక్, నగర ప్రధాన కార్యదర్శి యాసంనేని అజయ్ కృష్ణ, నాయకులు గరికె రాంబాబు, అశ్వరావుపేట మండల అధ్యక్షులు వినోద్, ములకలపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్, చండ్రుగొండ మండల అధ్యక్షులు నరసింహారావు, దమ్మపేట మండల అధ్యక్షులు రహీమ్, అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు కిషోర్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గం ఇంచార్జ్ డేగల రామచంద్రరావు మాట్లాడుతూ జనసేన పార్టీ ఒక్కరోజు అధికారంలో లేకున్నా దేశ చరిత్రలోనే కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ను కల్పిస్తున్న పార్టీ కేవలం జనసేన పార్టీ మాత్రమే అంతేకాకుండా నేటి సమాజంలో రాజకీయంలో సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చే యువతకు, మహిళలకు నాయకులుగా తీర్చిదిద్దే ప్రక్రియ కేవలం జనసేన పార్టీలను జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అశ్వరావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపించాలని ఈ నియోజకవర్గ ప్రజలకు చూపించాలని కోరడం జరిగింది. ఖమ్మం నియోజకవర్గం ఇంచార్జ్ మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి మన ప్రయత్నం ఎప్పుడూ ప్రజలకు చేరువై ప్రజా సమస్యలపై పోరాడుతూ, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరడం జరిగింది. సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి నరేష్ మాట్లాడుతూ.. నేటి యువత సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించడం నేర్చుకోవాలి నేటి రాజకీయాలపై అవగాహన ఉండాలి. నేటి రాజకీయ స్థితిగతులను పరిశీలించి జనసేన పార్టీకి అండగా నిలవాలని అశ్వరావుపేట నియోజకవర్గం ప్రజల్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ మండల నాయకులు, వీరమహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ సానుభూతి పరులు పాల్గొనడం జరిగింది.