ఏటుకూరులో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ జయప్రదం

ప్రత్తిపాడు: గుంటూరు 16వ డివిజన్ ఏటుకూరు గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలోలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసైనికులు, వీరమహిళలు, యువకులకు కీట్లు వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రియాశీలక కిట్లును గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మి దుర్గ లు వారి చేతులు మీదుగా జనసైనికులకు అందజేసినారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రతి ఒక్కరికీ చేరవేసేందుకు ప్రతి జనసైనికుడు, వీరమహిళలు కంకణబద్ధలై, పార్టీ కోసం కలిసికట్టుగా కృషి చేయగలరని జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య అన్నారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మి దుర్గ మాట్లాడుతూ నేడు మన 16వ డివిజన్ లో 5గురు బిఎల్వోలు ప్రతి ఇంటింటికి తిరుగుతూ నూతన ఓటర్లుగా అవకాశం వున్న కొత్త వారిని చేర్చుకోవడం, మరియు చనిపొయినవారిని తొలగిస్తూ, మార్పులు, చేర్పులు కార్యక్రమాన్ని చేపట్టినారు. కనుక జనసైనికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన ఓటర్లుగా ఆర్హత వున్న వారిని చేర్పించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని లక్ష్మి దుర్గ పిలుపునిచ్చారు. కాపు సంక్షేమ సేన గుంటూరు జిల్లా కార్యదర్శి ప్రతివాడ గంగాధరరావు మాట్లాడుతూ.. మన డివిజన్ లో పార్టి క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివాలశెట్టీ శ్రీనివాసరావు, దాసరి వాసు, యు ఆశోక్ కుమార్, ఏ శరణ్ కుమార్, గిరీష్ కుమార్, యన్ సత్యనారాయణ, టి మార్కండేయలు, యన్ శివాజి, పి ఈశ్వర్ కుమార్, జి నాగేశ్వరరావు, యన్ రమణ తదితరులు పాల్గొన్నారు.