హుజురాబాద్ నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ
*ముఖ్య అతిథిగా హాజరైన యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శివారెడ్డి చల్లా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గం: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తీసుకున్న నిర్ణయంలో భాగంగా.. జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు.. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువత కార్యదర్శి మూల హరీష్ గౌడ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రావుల మధు సూచనల మేరకు.. హుజురాబాద్ నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శివారెడ్డి చల్లా ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు క్రియాశీల కిట్ల పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం ఉపాధ్యక్షులు& హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు పల్లె మహేష్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రసాద్ గౌడ్, హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు బైరగొని అరవింద్ గౌడ్, గాడిపెల్లి శ్రీనివాస్, నారాయణ గౌడ్, సతీష్, అజయ్ అనిల్, కళ్యణ్ మహేష్, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-17-at-7.28.10-AM-1024x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-17-at-7.28.10-AM-1-1024x684.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-17-at-7.28.09-AM-1024x684.jpeg)