పలమనేరులో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పలమనేరు నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పలమనేరులో క్రియాశీలక సభ్యత్వం చేసిన నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్స్ కు క్రియాశీలక కిట్స్ అందించడం జరిగింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి జిల్ల కార్యదర్శి పసుపులేటి దిలీప్ ఆఫీస్ కు గత వారం అన్ని మండలాలకు సంబంధించ సుమారు 1200 సభ్యుల కిట్స్ అందినాయి. ఈ ఆదివారం సభ్యత్వం నమోదు చేసిన వాలంటీర్స్ కు సభ్యత్వం తీసుకున్న వారి కిట్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని మనవి చేయడం జరిగింది. కిట్స్ లో గాజు గ్లాస్, పవన్ కళ్యాణ్ గారి మనోగతం, ఐడెంటిటీ కార్డు, జనసేన పుస్తకం 5 లక్షలకు సంబంధించి ఇన్సూరెన్స్ బాండ్ వున్నాయి. వాలంటీర్స్ కుమార్, నంద, బాలాజీ, లోకనత్, రాజ, జనార్ధన్, అనిల్, వి కోట బాబు, పంజాని పవన్, పగడాల మోహన్, దాము, విశ్వనాథ, సాంబ తదితరులు పాల్గొన్నారు.