కందుల దుర్గేష్ చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రాజమండ్రి రూరల్ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు..జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతుల మీదుగా కాతేరు గ్రామంలో తాటపూడి రాజేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు చప్పా చిన్నారావు మరియు అధికార ప్రతినిధి యామన నారాయణ గౌడ్, ఇతర మండల కమిటీ సభ్యులు మరియు కాతేరు జనసైనికులు పాల్గొన్నారు.