కల్వకుర్తి నియోజకవర్గ జనసైనికులకు క్రియాశీలక సభ్యత్వ కిట్లపంపిణీ

  • ప్రతి పల్లెలో జనసేన జెండా ఎగరేస్తాం..

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మంగళవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న సభ్యులకు క్రియాశీలక సభ్యత్వాలు, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి కల్వకుర్తి నియోజకవర్గ నాయకులు ముకురాల కృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షులు
నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్,
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి
పి ఆర్. రాఘవేంద్ర హాజరయ్యారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న సభ్యులకు కిట్లు అందజేశారు. అదేవిధంగా పార్టీ బలోపితం కోసం క్రియాశీలకంగా కార్యకర్తలు ముందుకు రావాలి. ప్రతి పల్లెలో జనసేన జెండా ఎగరేయ్యాలి అని జనసైనికులకు దిశ నిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో
రేచర్ల శేఖర్, మున్నా సాయి, మార్చల సాయి కుమార్, బాలు బచ్చలకురా, భీమన్, పెరుమల్ల శేఖర్, సూర్య, గౌరవ్, రవి యాదవ్, చందు, ఆదిత్య, రాజు, నితీష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *