మసాడి భీమన్న ఆధ్వర్యంలో క్రియశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పాడేరు: జనసేన పార్టీ అరకు పార్లమెంట్ (పాడేరు) ఇంచార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య ఆదేశాలతో జి.మాడుగుల మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మసాడి భీమన్న ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల నాయకులతో కలిసి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వ మరియు ఇన్సూరెన్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాడేరు నియోజకవర్గం యువ నాయకుడు జర్ర అంకిత్, ఉపాధ్యక్షుడు సాగేని ఈశ్వరరావు, కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు తాంగుల రమేష్, గౌరవ అధ్యక్షుడు టి.వి రమణ, మసాడి సింహాచలం, బూత్ కమిటీ కన్వీనర్ కొర్ర భానుప్రసాద్, తల్లే త్రిమూర్తి, జల్లి చిన్న, నాగేశ్వరావు, సోమన్న, హోలేసు, తల్లే కృష్ణ, మధు, జనసేన పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.