రాజేష్ యడమ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తెలంగాణ, జనసేన పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ యడమ రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం మండే మార్కెట్ లో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ యడమ రాజేష్ చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకు క్రియాశీలక సభ్యత్వ కిట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజేష్ యడమ మాట్లాడుతూ అధినేత రూపొందించిన ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చాలా అద్భుతమైనదని, ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారారా అనేక మంది కార్యకర్తల కుటుంబాలను అధినేత అండగా నిలబడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ శ్రీరామ్ ఎన్, యూత్ వింగ్ కో-ఆర్డినేటర్స్ తలారి చంద్రకాంత్, నందికొళ్ల లక్ష్మణ్, స్టూడెంట్ వింగ్ కో-ఆర్డినేటర్ మన్నే వినయ్ కుమార్, సోషల్ మీడియా వింగ్ కో-ఆర్డినేటర్స్ పటాన్చెరు అఖిల్, గువ్వా మనోహర్, ఐటి వింగ్ కో-ఆర్డినేటర్ సందీప్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.