గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పాలకొండ, వీరఘట్టం మండలం, కిమ్మి గ్రామంలో పాలకొండ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కిమ్మి గ్రామ రైతులతో మాట్లాడుతూ… మన రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల చొప్పున 3000 మంది కౌలు రైతులకు 30 కోట్లు ఇస్తున్నారు అని రైతు సంక్షేమం కోసం రేపటి మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే అని. మామను చూసి అల్లుడుకి, తండ్రిని చూసి కొడుక్కి అవకాశం ఇచ్చారు, ఈసారి మన పిల్లల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వజ్రగడ జానీ, ఆర్.గోవింద, సత్యనారాయణ జనసైనికులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.