శ్రీకాళహస్తి జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం/పట్టణ క్రియాశీల సబ్యులకు కిట్లు పంపిణీ మండల అధ్యక్షులు మునికుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు విజయానందరావు అధ్వర్యంలో, నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా అధ్యక్షతన సభ్యులకు అందజేయడం జరిగింది. క్రియాశీల వాలంటీర్ సభ్యులకు మోమెంటో, జనసేన జెండా ఇచ్చి దుశ్యాలువతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు డా. హరి ప్రసాద్ హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలూరు మునికుమార్, జగదీష్, పార్థసారథి, గోపి రెడ్డివారి, త్యాగరాజులు, జ్యోతి, భాగ్యలక్ష్మి, ఉమా మహేశ్వరి, కైలసాని సాయి, నాగరాజు, గోవర్ధన్, జనసైనికులు పాల్గొన్నారు.