టేకిశేట్టిపాలెం లంక వరద బాధితులకు బిర్యానీ ప్యాకెట్ ల పంపిణి

రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం టేకిశేట్టిపాలెం గ్రామంలో మాజీ ఎంపీపీ లింగోలు మహాలక్ష్మి (చిన్నబ్బులు), సర్పంచ్ విస్సా తాతలు నాయుడు ఆధ్వర్యంలో వరద ప్రాంతాల్లో జనసేన నాయకులు పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని వారికి కావాల్సిన ఆహారం రెటైరెడ్ కెనరా బ్యాంకు మేనేజర్ గొల్లమందల పూర్ణ భాస్కరరావు సమకూర్చిన బిర్యానీ ప్యాకెట్ లను జనసేన నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు దిరీసాల బాలాజీ, తాడి మోహన్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, ఎంపీపీ మేడిచర్ల సత్య వాణి రాము, పినిసెట్టి బుజ్జి,రావూరి నాగు, మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, సూరిశెట్టి శ్రీనివాస్, మళ్లిపూడి సత్తిబాబు ఎంపీటీసీలు దార్ల లక్ష్మి కుమారీ, జక్కంపూడి శ్రీదేవీ శ్రీనివాస్, ఉండపల్లి అంజి, అడబాల శ్రీనివాస్, అల్లూరి రంగరాజు, వైస్ సర్పంచ్ కటికిరెడ్డి మహేష్, గ్రామ శాఖ అద్యక్షులు కాటం రాజు, రావూరి తేజ, దొరబాబు, మండల కమిటీ సభ్యులు ముత్యాల గణేష్ నాయుడు, బోనం భాస్కర్, ఆకుల వాసు, మేడిచర్ల ప్రసాద్, వేంకన్న, శ్రీను, రాము, సురేష్, సతీష్, జక్కంపూడి పాపాలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.