గోరంట్ల జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ, పానకం పంపిణీ

గోరంట్లలో శ్రీరామనవమి సందర్భంగా.. ఆదివారం మరువ ఆంజనేయస్వామి ఉట్ల పరుష లో.. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుమారు 5 వేల మందికి మజ్జిగ, పానకం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, కార్యనిర్వాహక జిల్లా కమిటీ సభ్యుడు పి. వెంకటేష్, నాయకులు వెంకటేష్, గొల్ల అనీల్ కుమార్, రాఘవేంద్ర, నరేష్, సీన.గంగరాజు, బాబావలి తదితరులు పాల్గొన్నారు.