మార్కాపురం జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లు, జనసేన కరపత్రాల పంపిణీ

మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాద్ ఆదేశం ప్రకారం, జనసేన పార్టీ తరఫున మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల ప్యాకెట్లు, మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు లక్ష రూపాయల చెక్కులు అందించిన వివరాలు, 2024 జనసేన గెలుపుకు షణ్ముఖ వ్యూహం విధానము కరపత్రాలుగా ముద్రించి భక్తులందరికీ పంచడం జరిగింది.