ఏబికె ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ

భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం శ్రీరామ నవమి సందర్బంగా కళ్యాణాన్ని తిలకించటకు వచ్చే భక్తులకు జనసేన పార్టీ తరపున కొసనా అంకబాబు(ఏబికె) ఆధ్వర్యంలో సారపాక సెంటర్‌ నందు ఉచిత మజ్జిగ, పానకం మరియు మంచినీరు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసైనికులు గోవిందు వెంకటేశ్వర్లు, ఆకుల రఘు, పవణ్‌, ముఖేష్‌ లతో పాటు జనసేన వీర మహిళలు అనేకమంది జనసైనికులు పాల్గొన్నారు.