గాజువాక జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

గాజువాక నియోజకవర్గం, పెదనడుపూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవంలో భాగంగా శ్రీకృష్ణదేవరాయ యువత ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. జనసేన పార్టీ నాయకులు డాక్టర్ రౌతు గోవిందరావు(రిటైర్డ్ ఆర్మి) ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా చేపట్టడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర ఫైనాన్షియల్ కమిటీ సభ్యులు గాజువాక సీనియర్ నాయుకులు తిప్పల రమణారెడ్డి ఆర్థిక సహాయంతో 800 లీటర్ల మజ్జిగ పంపిణీ భక్తులకు అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్షియల్ కమిటీ సభ్యులు తిప్పల రమణారెడ్డి, రాష్ట్ర ఫైనాన్షియల్ కమిటీ సభ్యులు పీలా రామకృష్ణ, 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి, జనసేన పార్టీ ముఖ్య నాయుకులు ముక్క శ్రీను, మజ్జి సత్యారావు, గుంటూరు మూర్తి, ములకలపల్లి వంశీ, పవన్ సుధమల్ల, గొంతెన జగదీష్, పితాని భాస్కర్, నజీర్, సియ్యాద్రి పెంటయ్య, ఎలమంచిలి సంజీవ్, వీరబాబు, స్వరాజ్ వీర మహిళలు మాక షాలిని, రామలక్ష్మి, అనురాధ, గెడ్డం చంటి, యోగి, కృష్ణ, నర్సింగ్, త్రినాధ్, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.