విద్యార్ధులకు కుర్చీల పంపిణీ

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం, గుజ్జ గ్రామానికి చెందిన మునుగోడు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చిన్నం రాజీవ్, జనరల్ సెక్రటరీ చిన్నం ప్రశాంత్, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాన్ని పునఃపుచ్చుకొని ఎన్నో సంవత్సరాల నుండి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నిరుపేద విద్యార్థులకు 60 కుర్చీలు మరియు నిత్యవసర వస్తువులు సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యంతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share this content:

Post Comment