జనసేన ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు కూల్ డ్రింక్స్ పంపిణీ

పార్వతీపురం మండలం, క్రిష్ణపల్లి గ్రామంలో సోమవారం జనసేన పార్టీ నాయుకులు అక్కివరపు మోహన్ రావు చేతులు మీదుగా ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలను కలిసి కూల్ డ్రింక్స్ పంపిణీ చేసి జనసేన పార్టీ యొక్క భావజాలాన్ని తెలియజేయడము జరిగింది. మరియు క్రిష్ణపల్లి గ్రామంలో క్రొత్తగా నిర్మాణం చేస్తున్న కళ్యాణమండపానికి అక్కివరపు మోహన్ రావు 50,000 రూపాయాలు విరాళం ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయుకులు మండల అధ్యక్షురాలు ఆగురు మణి, బొనెల గొవింధమ్మ, గుంట్రేడ్డి గౌరీశంకర్, బంటు శీరీశ్, చిట్లు గణేశ్, తేజ, పవన్, రమేశ్, అప్పలనాయుడు, ఈశ్వర్, ఉపేంద్ర, రాజు, రామకృష్ణ, ప్రవీణ్, హారీశ్, జనసైనికులు, వీరమహిళలు మరియు ఆ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.