ఆటో డ్రైవర్లకు డాక్టర్ కందుల యూనిఫారంల పంపిణీ

  • పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు
  • దక్షిణ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు
  • డాక్టర్ కందులకు బ్రహ్మరథం పడుతున్న స్థానికులు

వైజాగ్ సౌత్: విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నియోజకవర్గంలో నిర్విరామంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా వృద్ధులకు బియ్యం, వాకింగ్ స్టాండ్లు మరియు ఆటో డ్రైవర్లకు యూనిఫారాలను పంపిణీ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకంచేశారు. ఇదే సందర్భంలో నియోజకవర్గంలోని ప్రతి వార్డులో సుడిగాలి పర్యటనలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకొస్తేనే పాలన మారుతుందని చెబుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. మరోపక్క అధికార వైసీపీ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబడుతూ ప్రజల పక్షాన పార్టీ ఆదేశాలతో పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 39వ అధ్యక్షులు మైలపల్లి చిన్న, 31 వ వార్డు అధ్యక్షులు రూప, జనసేన నాయకులు ప్రణీత్, అంగటి త్రినాధ్, సిరపు అప్పారావు, శ్రీను, జయ, పద్మ, ప్రసాద్, దేవి, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.