జనసేన ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

శృంగవరపు కోట, జామి మండలం, అగ్రహారం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో గ్రామస్తులకు గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు పి.వి.ఆర్.వర్మ గారి సహకారంతో వీటిని అందించారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, ఎస్.కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్యనారాయణ, చోడవరం నియోజకవర్గ నాయకులు సిరపరపు రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారి చేతులు మీదుగా సుమారు 130 కుటుంబాలకు సరుకులు అందించారు. ఈ సందర్భంగా పాలవలస యశస్వి మాట్లాడుతూ వర్మ గారి సేవలను అభినందించారు. జనసైనికులు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వబ్బిన సన్యాసినాయుడు, మల్లువలస శ్రీను, రుద్రనాయుడు, పిల్లా రామదుర్గ, గాలి అప్పారావు, జనసైనికులు పాల్గొన్నారు.