కలిచేడులో వరద బాధితులకు 300 మందికి ఆహార పొట్లాలు పంపిణీ

సాయి సత్సంగ నిలయం అధినేత కోట సునీల్ సహకారంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ అసోసియేషన్, ఆశ్రయా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని కలిచేడు ఎస్ టి కాలనీ, వడ్డి పాళ్ళెం నందు 300 మంది వరద బాధితులకు ఆహార పొట్లా లను మంగళవారం మధ్యాహ్నం అందజేశారు.ఈ సందర్బంగా సాయి సత్సంగ నిలయం అధినేత కోట శ్రీనివాసులు తరపున సూర్య మాట్లాడుతూ తాము గూడూరు నుండి వేస్తున్నామని గత రెండు రోజులుగా 100 గ్రామాలు నీట మునిగి ఉన్నాయన్నారు. రెండు రోజులుగా రోజుకు 600 మంది వరద బాధితులకు ఆహారాన్నిఅందజేస్తున్నామన్నారు.కలిచేడు లోని ఎస్ టి కాలనీ, వడ్డి పాళ్ళెం లోని ఎరుకుల కాలనీలో వరద బాధితులకు 300 మందికి అందజే శామన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదని ఏవైనా సహాయం కావాలంటే తమ సభ్యులను సంప్రదించమని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సూర్య, చందు, సర్దార్, సాయి, మహేష్, జనసేన లీగల్ సెల్ పార్టీ సభ్యులు తీగల చంద్రశేఖర్, సైదాపురం జనసేన నాయకులు రవీంద్రనాథ్, అచ్చి సురేష్, తురిమెర్ల చిన బాబు, కోండిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.