పండగ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ

*జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పండగ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జాతర మహోత్సవంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమనికి హాజరైన యువజన విభాగం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పండగ గగన్ కుమార్ ఆహ్వానం మేరకు ఒద్యారం గ్రామంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతర మహోత్సవానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రావుల మధు, ప్రధాన కార్యదర్శి చల్లా శివారెడ్డి హాజరై మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు తడకపెళ్లి అరవింద్, పల్లె మహేష్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనిల్ రెడ్డి, విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ సావనపెళ్లి ప్రేమ్ కుమార్ సీనియర్ నాయకులు నరిగే శివ కుమార్, సావనపెల్లి ప్రశాంత్, కవ్వంపెల్లి పవన్, హరీష్, మోతే సాయి ఉదయ్, సాయి చంద్, చేను పోచయ్య, జనసైనికులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.