జనసేన ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

పెందుర్తి నియోజకవర్గం: వినాయక చవితి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకై జనసేన ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త తమ్మిరెడ్డి శివశంకర్ ఆశీస్సులతో 94వ వార్డు పురుషోత్తపురం గ్రామంలో ఇంటింటికి 200 మట్టి వినాయకుల ప్రతిమలను రామాలయం దగ్గర పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.