ఆత్మీయ ఫౌండేషన్ ద్వారా ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ

అమెరికాకి చెందిన ఎన్నారై వారు ఆత్మీయ ఫౌండేషన్ ద్వారా ఉచిత కుట్టుమిషన్లు తుందుర్రు, గొల్లవాణితిప్ప గ్రామాల్లో సుమారు 70 మందికి అందించడం జరిగింది. వివరాల్లోకి వెళితే అమెరికాకి చెందిన ఆత్మీయ ఫౌండేషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పూర్తితో మహిళ సాధికారత లక్ష్యంగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా తుందుర్రు, గొల్లవాణితిప్ప గ్రామాల్లో సుమారు 70 మంది కాపు, ఎస్సి, బీసీ మైనార్టీ మహిళలకు గత 45 రోజులుగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. వారందరికీ శిక్షణ పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినీడి తిరుమల రావు(బాబీ) ముఖ్య అతిథిగా జనసేన ఎంపీటీసీలు ఆరేటి వాసు, తాతపూడి రాంబాబు ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టుమిషన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మల్లినీడి తిరుమలరావు(బాబి) మాట్లాడుతూ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నా కాపు పిల్లలు అందరూ డబ్బులు పోగు చేసి ఆత్మీయ సేవా సంస్థ స్థాపించారని. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. మునుముందు మరిన్ని సేవ కార్యక్రమాలు చెయ్యాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా ఆత్మీయలో ఎంతో హుషారుగా సేవ చేస్తూ, జనసేన పార్టీ ఎదుగుదలకి ఎంతో కృషి చేసి స్వర్గస్తులైన గ్రంధి అనసూయని అందరూ స్ఫురిగా తీసుకోవాలని ఆకాక్షించారు. ఆత్మీయ సేవా సంస్థ జనసేన పార్టీకి మద్దతుగా ఏర్పాటు చేశారని. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగర జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బేతపూడి సర్పంచ్ తిరుమల యామిని దేవి, చేగొండి నాని, కొడవర్తి శివ, కొట్టు సురేష్, పెంటపాటి మురళి, కట్టా నాగేశ్వరరావు, కోయ సూర్యనారాయణ తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.