మల్కిపురం సెంటర్లో గాజుగ్లాసుల పంపిణీ

రాజోలు నియోజకవర్గం, జనసేన బలోపేతంలో భాగంగా మల్కిపురం మండలం, మల్కిపురం సెంటర్ నందు గల మమత టిఫన్ సెంటర్ నందు జనసేన వీరమహిళలు జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 200 గాజు గ్లాసులు పంచడం జరిగింది. వీరమహిళలు ఆధ్వర్యంలో గాజుగ్లాసులను పంపిణీ చేస్తూ జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, ఉలిశెట్టి అన్నపూర్ణ, మెండు అంజిని, హేమ మల్లేశ్వరి భావన, సత్య, యమున మరియు వీరమహిళలు జనసైనికులు పాల్గున్నారు.