మంథనిలో జనసేన పార్టీ క్రీయశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

మంథని నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రీయశీలక సభ్యత్వం పొందిన జనసేన పార్టీ కార్యకర్తలకి మంథని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాయ రమేష్ చేతుల మీదుగా నాయకులకు, కార్యకర్తలకు అందించడం జరిగింది. అలాగే ఈ కిట్లో సభ్యత్వం తీసుకున్న ప్రతి జనసైనికునికి ఐదు లక్షల ప్రమాద భీమా బాండ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాయ రమేష్ నాయకులతో మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తున్నందున పార్టీని మరింత ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈరవేన ఓం ప్రకాష్, జనగాం పవన్, మేకల శ్రావణ్, కాసు రంజిత్, ప్రణయ్ రెడ్డి, శివ ప్రసాద్, వంశీ, అభిషేక్, తదితరులు పాల్గొన్నారు.

మండల అధ్యక్షునిగా నియమించినందుకు కృతజ్ఞతలు:

తెలంగాణలో జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే సదుద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారం నన్ను నమ్మి కాటారం మండల అధ్యక్షునిగా నియమించినందుకు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇందుకు సహకరించిన జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్ మరియు మంథని నియోజకవర్గ ఇంచార్జి మాయ రమేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు. కాటారం మండలంలో పార్టీ బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తా అని కోరుకుంటూ నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన పెద్దలకి మరొక సారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని జనసేన పార్టీ కాటారం మండల అధ్యక్షులు జనగాం పవన్ అన్నారు.